అమరావతి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-2027 ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ వృద్ధి, దీర్ఘకాలిక ఆకాంక్షలపై దృష్టి సారించిందని అన్నారు. కీలక ఖనిజాల కారిడార్, హై-స్పీడ్ రైలు కనెక్టివిటీ, డేటా సెంటర్లకు పన్ను ప్రోత్సాహకాలు, ఎలక్ట్రానిక్స్ తయారీకి బలమైన ప్రోత్సాహం ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు కేంద్రానికి. పర్యాటకంపై పునరుద్ధరించిన దృష్టి వంటి కార్యక్రమాల ద్వారా ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు గణనీయమైన అవకాశాలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరంతర ఆర్థిక వేగానికి , భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే అభివృద్ధికి మద్దతు ఇచ్చే బడ్జెట్ను ప్రవేశ పెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి , ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర బడ్జెట్ 2026ను స్వాగతిస్తున్నట్లు చెప్పారు నారా లోకేష్. ఇది భారతదేశ వేగవంతమైన వృద్ధి , దీర్ఘకాలిక ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న ఒక సమతుల్య రోడ్ మ్యాప్ అని అభివర్ణించారు. నిరంతర ఆర్థిక వేగానికి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే అభివృద్ధికి మద్దతు ఇచ్చే బడ్జెట్ను ప్రవేశపెట్టడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు గణనీయమైన అవకాశాలను అందిస్తుందని మంత్రి అన్నారు. ప్రతిపాదిత చర్యలు పెట్టుబడులను వేగవంతం చేయడానికి, ఉపాధి కల్పనను పెంచడానికి , అభివృద్ధి చెందుతున్న రంగాలలో రాష్ట్ర స్థానాన్ని బలోపేతం చేయడానికి సహాయ పడతాయని నారా లోకేష్ పేర్కొన్నారు.
The post అన్ని వర్గాలకు మేలు చేకూర్చిన బడ్జెట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
