Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

చిట్టెం సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు

Ai generated article, credit to orginal website, October 11, 2025

అమరచింత, అక్టోబర్‌ 10 : తెలంగాణలో మార్పుపేరుతో ప్రజలను మోసం చేసే అబద్ధపు హమీలతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హమీలను నేరవేర్చడం లేదని, గ్రామాలను అభివృద్ధి చేస్త్తారన్న నమ్మకం తమకు కలగడం లేదంటూ అందుకే కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని అమరచింత మండలం నందిమళ్లకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
వీరికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కారు ఎక్కెందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్యూ కడతారని, అమలు చేయలేని హమీలను ఇచ్చి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు మాటలతో కాలయాపన చేస్తుంటే పట్టణల్లో, గ్రామాల్లో ఉన్న ప్రజలకు మొఖం చూపలేక ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో ఆత్మకూర్‌, అమరచింత మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ఉన్నారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • YS Jagan: మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన 
  • Kinjarapu Rammohan Naidu: దేశం గర్వించేలా భోగాపురం విమానాశ్రయం – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
  • IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • Jubilee Hills: నేటి నుండి జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో హోం ఓటింగ్
  • Minister Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ పాలనపై మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్

Recent Comments

No comments to show.

Archives

  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes