Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

పొంగులేటి Vs మహిళా మంత్రులు.. పొన్నం ఇష్యూ ముగియక ముందే కాంగ్రెస్‌లో మరో ముసలం!

Ai generated article, credit to orginal website, October 9, 2025

వరంగల్‌ వ్యవహారాల్లో పొంగులేటి అతిజోక్యం
గుట్టుచప్పుడు కాకుండా మేడారం పనులకు టెండర్‌
అవమానంగా భావిస్తున్న మంత్రులు సీతక్క, సురేఖ?
పొంగులేటి ఆధిపత్యంపై ఫిర్యాదు చేసేందుకు రెడీ

వరంగల్‌, అక్టోబర్‌ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం సమసిపోక ముందే మరో జిల్లాలో మంత్రుల మధ్య విభేదాలు పొడచూపాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధిపత్య తీరుపై అదే జిల్లా మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఏకంగా కాంగ్రెస్‌ (Congress) అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. రేవంత్‌ సర్కార్‌కు ఉమ్మడి కరీంనగర్‌ సెగ చల్లారక ముందే మరో జిల్లా పొగ రాజుకోవడం తలనొప్పిగా మారింది.
ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అదే జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులపై చెలాయించే ఆధిపత్యం తాజాగా పరాకాష్ఠకు చేరిందని తెలుస్తున్నది. దీనికి మేడారం కేంద్రంగా జరిగే పనులే కేంద్ర బిందువుగా మారాయి. మహిళా మంత్రులైన సీతక్క, కొండా సురేఖ ‘ఉత్త’ నిమిత్త మాత్రులేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తేల్చారా? అని జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది.
వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతర నేపథ్యంగా జరిగే పనుల విషయంలో మంత్రి పొంగులేటి ‘ఇటేటు రమ్మంటే ఇల్లంత నాదే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మహిళా మంత్రులిద్దరూ రగిలిపోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఏ ఇద్దరినీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలువనీయకుండా తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పొంగులేటి ఆధిపత్యంపై మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. బహిరంగంగానే మంత్రి పొంగులేటి వ్యవహారంపై పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించిన దాఖలాలూ ఉన్నాయి.
అసలేం జరిగిందంటే?
మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల నవనిర్మాణం కోసం రూ.71 కోట్ల టెండర్లను ప్రభుత్వం పిలిచింది. దేవాదాయ శాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే, ఆదివాసీ బిడ్డ, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అయిన సీతక్కకు కనీస సమాచారం లేకుండానే టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందనే చర్చ సాగుతున్నది. గతనెల 23న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌ తదితరులు మేడారం సందర్శించారు.
ఆ సమయంలో మేడారంలో చేపట్టనున్న పనులను ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి వారానికి ఒకసారి అయినా సమీక్షించాలని సీఎం ఆ సందర్భంగా చెప్పారు. ఆ సమయంలోనే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సీతక్క, సురేఖ షాక్‌కు గురయ్యారని, దీనికితోడు అదే సభలో సంబంధిత మంత్రి కొండా సురేఖకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమాన పరిచారనే ఆరోపణలు వినిపించాయి.
వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనే అవకాశం, జిల్లాలో కొంతమంది ప్రజాప్రతినిధులను తమవాళ్లుగా మలుచుకొని రాజకీయాలు చేయడమే కాకుండా, ఆఖరికి మేడారం జాతర నిర్మాణాలపై సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే, తాజాగా మేడారం పనుల టెండర్ల ముసుగులో తన సంబంధీకులకు, తన జిల్లా వారికి పనులను కట్టబెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకు బలం చేకూరేలా పనుల కోసం టెండర్లకు వచ్చిన మూడు కంపెనీల్లో రెండు మంత్రి పొంగులేటి సన్నిహితులవని, ఒకటి ఇతరులది కావడంతోనే ఆ మంత్రులను దూరం పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది.
ఆ మంత్రి శాఖలో పొంగులేటి పెత్తనం?
బీసీ సామాజికవర్గం, మహిళా మంత్రి అయిన కొండా సురేఖ ప్రాతినిథ్యం వహిస్తున్న దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి పెత్తనం ఏమిటి? అని ఆమెతో సహా పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. తన మంత్రిత్వ శాఖలో తనకు తెలియకుండా టెండర్లు పిలవడం ఎంతవరకు న్యాయమని, ఈ విషయంలో ఆమె అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. మాటిమాటికీ ఆడబిడ్డలు అంటూ తమను సంబోధిస్తూనే తమపైనే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారని ఆమె తన సన్నిహితులతో వాపోయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మేడారం పనులకు టెండర్లు పిలవడం, ‘ముఖ్య’నేత ప్రధాన సలహామండలి బాధ్యులు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ ఎమ్మెల్యే వ్యాపార భాగస్వామిగా ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన సంస్థకు కేటాయించడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన ఆ మంత్రి అన్ని విషయాలను అధిష్టానం ‘నోటీస్‌’కు చేరవేసే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తున్నది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • Election Commission: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌-2
  • Mahagathbandhan: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం – మహాగఠ్‌బంధన్‌ మ్యానిఫెస్టో
  • Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
  • Delhi Airport: దిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సు దగ్ధం
  • APEPDCL: మొంథా తుఫానుపై అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్

Recent Comments

No comments to show.

Archives

  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes