తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 18 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 77,049 మంది భక్తులు దర్శించుకోగా 21,469 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి ( Hundi Income ) రూ. 3.73 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
ఫిబ్రవరి 8 నుంచి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా ఫిబ్రవరి 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని ఆ రోజున తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, అనంతరం ఆగమోక్తంగా కార్యక్రమాలు చేపడుతారని వెల్లడించారు.
