ముంబై : కోట్లాది మంది భారతీయులు ఇవాళ ముంబై వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. వెస్టిండీస్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ ను సెమీస్ చేర్చిన సంజూ శాంసన్ పై ఎక్కువగా భారత్ నమ్మకం పెట్టుకుంది. మరో వైపు అభిషేక్ శర్మను ఆడిస్తారా లేదా అన్నది అనుమానంగా ఉంది. ఇటు బ్యాటింగ్ లోనూ అటు బౌలింగ్ లోనూ సత్తా చాటితేనే ఇంగ్లండ్ ను ఓడించేందుకు వీలవుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా ఆశలపై నీళ్లు చల్లింది. 9 వికెట్ల తేడాతో ఓడించి టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. ఇవాళ జరిగే కీలక సెమీస్ లో ఎవరు గెలిస్తే వారితో ఫైనల్ ఆడుతుంది. హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ కు సారథ్యం వహిస్తున్నాడు. ఆ జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. 2022లో జరిగిన వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ ఇండియాను ఓడించింది. 2024లో అందుకు టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది.
ఇక జట్ల పరంగా చూస్తే వివరాలు ఇలా ఉన్నాయి. భారతదేశం : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు సామ్సన్, శివమ్ దుబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్.
ఇంగ్లాండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్
The post వరల్డ్ కప్ ఫైనల్ కోసం భారత్ సన్నద్దం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
