Doomsday Missile |(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు క్షిపణి మినిట్మ్యాన్-3ని మంగళవారం రాత్రి కాలిఫోర్నియా తీరంలో అమెరికా పరీక్షించింది. ‘డూమ్స్డే’ మిసైల్గా పిలిచే ఈ క్షిపణి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించినట్టు అమెరికా వెల్లడించింది.
డూమ్స్డే క్షిపణి సామర్థ్యం ఇలా..
మినిట్మ్యాన్-3లో అత్యంత శక్తివంతమైన మార్క్-21 రీఎంట్రీ వెహికిల్ ఉంటుంది. దీనిలో న్యూక్లియర్ పేలోడ్ను అమర్చవచ్చు. 1945లో జపాన్లోని హిరోషిమాపై జారవిడిచిన అణుబాంబు కంటే 20 రెట్లు శక్తివంతమైన అ ణు వార్హెడ్లను ఇది మోసుకెళ్లగలదు.
వేగం ఇలా..
ఈ క్షిపణి గంటకు 15 వేల మైళ్ల వేగంతో 6 వేల మైళ్ల దూరం వరకు ప్రయాణించగలదు. అంటే దీన్ని ప్రయోగించిన 15-20 నిమిషాల్లోనే లక్ష్యాన్ని ఛేదించగలదన్న మాట. గత నవంబర్లో ఈ క్షిపణిని అమెరికా పరీక్షించింది. ఇప్పుడు పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మళ్లీ పరీక్షించడం చర్చనీయాంశంగా మారింది.
