అమరావతి : ఏపీలో అంగన్వాడీల నిర్వహణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గురువారం శాసనసభలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్, మహమ్మద్ నజీర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 257 ఐసిడిఎస్ ప్రాజెక్టులు పరిధిలో 55746 అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపారు. వీటిలో 21,756 అంగన్వాడి కేంద్రాలు సొంత భావనాల్లో 10, 566 కేంద్రాలు నడుస్తున్నాయని, ఇతర ప్రభుత్వ భవనాల్లో 23,424 అంగన్వాడీ కేంద్రాలు అద్ది భవనాల్లో నడుస్తున్నాయని మంత్రి వెల్లడించారు.
వీటిలో 292 అంగన్వాడీ భవనాలు అసంపూర్తి దశలో ఉన్నాయని వీటిలో 948 అంగన్వాడి భవనాలు ముగింపు దశలో ఉండగా 873 స్లాబ్ స్థాయిలో 351 పైకప్పు స్థాయిలో 269 లింటెల్ స్థాయిలో 429 బేస్మెంట్ స్థాయిలో , 52 పునాది దశలో ఉన్నాయని సుధారాణి చెప్పారు.2,922 భవనాలను పూర్తి చేసేందుకు 193.92 కోట్ల రూపాయలు మంజూరుకు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. వీటిలో ముగింపు దశలో ఉన్న 948 భవనాల కోసం 48.52 కోట్లు ఉన్నాయని తెలిపారు. ముగింపు దశలో ఉన్న భవనాలను పూర్తి చేయడం కోసం ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి గాను నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని స్పష్టం చేశారు.
2025 సంవత్సరంలో PM-JANMAN పథకం కింద 78 అంగన్వాడీ భవనాలు నిర్మాణం కోసం మూడు జిల్లాలు శ్రీకాకుళం, పార్వతిపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు 9.36 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అదనపు అంగన్వాడీల కోసం మరో నాలుగు కోట్లు రిలీజ్ చేశామన్నారు. ఆరేళ్ల లోపు పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం ప్రీ-స్కూల్ విద్యా , ఆరోగ్య తనిఖీలను అందించడం జరుగుతుందని సుధారాణి చెప్పారు. 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు ,బ్లాక్ కోఆర్డినేటర్లకు 75 కోట్లతో 5జీ స్మార్ట్ ఫోన్లను అందించామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి అంగన్వాడి కేంద్రాలుగా మార్చామని తెలిపారు.
The post అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
