Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Telangana Assembly Budget Sessions: నేటి నుండే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.!

Ai generated article, credit to orginal website, March 16, 2026

Telangana Assembly Budget Sessions: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు (మార్చి 16) ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ శివప్రతాప్ శుక్ల ప్రసంగిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు స్పీకర్ చాంబర్ లో బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతుంది ప్రభుత్వం. ఉదయం 11గ:45 నిమిషాలకు ఉభయ సభల సంయుక్త సమావేశం ప్రారంభం కానుంది.
Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!
గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన శివప్రతాప్ శుక్ల మొదటిసారి అసెంబ్లీకి రానున్నారు. ఉదయం 11: 25 నిమిషాలకు గవర్నర్ అసెంబ్లీకి చేరుకుంటారు. 11:45 నిమిషాలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభంవుతుంది. 10 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగానే సభా ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ఈ విగ్రహ రూపాన్ని బిఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది.
అసెంబ్లీలో కీలక అంశాలను చర్చించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం తీసుకురాబోతుంది ప్రభుత్వం. గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ కోసం కొత్త చట్టానికి మద్దతుపై చర్చించనున్నారు. ఇంకా విద్యారంగంలో కొత్త విధానాల అమలు మార్పులు బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరగనుంది. సోషల్ మీడియా కట్టడి పైన చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే నగరంలోని మూసి నది ప్రక్షాళన నదీ జలాల అంశం, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది.
Ustaad Bhagat Singh: ఈ ఉగాది.. ‘ఉస్తాద్’ ఉగాది.. పవర్ స్టార్ ఒక రియల్ ఇన్‌స్పిరేషన్: శ్రీలీల
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటరెడ్డి వెంకట్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు, డిజీపి శివధర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనుకోని సంఘటనలు, అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. అసెంబ్లీ కౌన్సిల్ ఇప్పుడు ఒకే ప్రాంగణంలో పనిచేయబోతున్నాయి. దీంతో సెక్యూరిటీ పార్కింగ్ లాంటి విషయాల్లో ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు స్పీకర్ చాంబర్ లో బిఏసి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పని దినాలు ఎజెండా పై చర్చించనున్నారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • త్వ‌రలో మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దు
  • గాజువాక టౌన్‌లో ‘కలర్స్ 2.0’ ప్రారంభం
  • 9 గగన‌తలాలకు దూరంగా ఉండాలి
  • ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
  • ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ క‌లెక్ష‌న్లలో కింగ్

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes