Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఇరాన్ చేసిన సంచలన ప్రకటన ప్రస్తుతం ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఇరాన్ ఇప్పుడు చమురు, వాణిజ్య మార్గాలను పూర్తిగా దిగ్బంధించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇరాన్కు చెందిన తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ ఇటీవల వెలువరించిన ఒక నివేదిక ప్రకారం.. తమ భూభాగంపై గానీ లేదా ద్వీపాలపై గానీ దాడి జరిగితే, బాబ్ అల్-మండేబ్ జలసంధి వద్ద ఉద్రికత్తతలు పెంచుతామని సైనిక వర్గం హెచ్చరించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తించింది. ముఖ్యంగా ఈ సముద్ర మార్గం ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన వాణిజ్య మార్గాలలో బాబ్ అల్-మండేబ్ జలసంధి ఒకటి. ఇప్పటికే ప్రపంచ చమురు, గ్యాస్లో సుమారు 20 శాతం రవాణా జరిగే హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. ఈ బాబ్ అల్-మండేబ్ జలసంధి సైతం మూసివేస్తే ప్రపంచం అతలాకుతలమవుతుందని నిపుణులు అంటున్నారు.
READ MORE: AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక భేటీ.. అమరావతి చట్టబద్ధతపై తీర్మానం..
వాస్తవానికి.. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ దీవులను లక్ష్యంగా చేసుకోవచ్చని ప్రకటించాయి. పర్షియన్ గల్ఫ్లో ఇరాన్కు 30కి పైగా దీవులు ఉన్నాయి. ఈ దీవులలో చాలా వరకు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. చమురు, గ్యాస్ ఎగుమతి చేయడానికి, సముద్ర భద్రతను కాపాడటానికి, హోర్ముజ్ జలసంధిని పర్యవేక్షించడానికి ఇరాన్ సుమారు 10 ద్వీపాలపై ఆధారపడి ఉంది. అందుకే తమ ద్వీపాలను లక్ష్యంగా చేసుకుంటే, పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ స్పష్టంగా హెచ్చరించింది. తత్ఫలితంగా, బాబ్-ఎల్-మండేబ్కు సంబంధించిన ఇటీవలి సమాచారం ప్రపంచానికి ఒక ముఖ్యమైన ముప్పును కలిగించింది.
READ MORE: Samsung Galaxy A Series: గెలాక్సీ A57 5G & A37 5G లాంచ్.. 5,000mAh బ్యాటరీ.. మిడ్-రేంజ్లో ప్రీమియం ఎక్స్పీరియన్స్
బాబ్-ఎల్-మండేబ్ అంటే ఏమిటి? ఎందుకు అంత ముఖ్యమైనది?
అరబిక్లో బాబ్ అల్-మండేబ్ అంటే “కన్నీటి ద్వారం” అని అర్థం. ఈ ఇరుకైన సముద్ర మార్గం ఎర్ర సముద్రాన్ని, ఏడెన్ గల్ఫ్ను, అరేబియా సముద్రాన్ని కలుపుతుంది. ఇది యెమెన్ (ఇరాన్ మద్దతు ఉన్న హౌతీల నియంత్రణలో ఉంది), హార్న్ ఆఫ్ ఆఫ్రికా (జిబూటి మరియు ఎరిట్రియా) మధ్య ఉంది. ఇది అత్యంత ఇరుకైన ప్రదేశం.. కేవలం 29 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ జలమార్గం ప్రపంచ వాణిజ్యానికి ఒక ప్రధాన కేంద్రం. ఐరోపా, ఆసియా, మధ్యప్రాచ్యం మధ్య చమురు, గ్యాస్ రవాణా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఐరోపా, ఆసియా మధ్య సూయజ్ కాలువ గుండా ప్రయాణించే ఏ ఓడ అయినా బాబ్ అల్-మండేబ్ గుండా వెళ్ళవలసి ఉంటుంది. అందుకే దీనిని ప్రపంచంలోని అత్యంత కీలకమైన చోక్పాయింట్లలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ మార్గానికి అంతరాయం ఏర్పడితే, ఓడలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ఆఫ్రికా ఖండం మొత్తాన్ని చుట్టిరావాల్సి ఉంటుంది. దీనివల్ల డెలివరీ సమయాలు 15-20 రోజులు పెరగడంతో పాటు, రవాణా ఖర్చులు సైతం గణనీయంగా పెరుగుతాయి. నివేదికల ప్రకారం, ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12 శాతం బాబ్ అల్-మండేబ్ గుండా జరుగుతుంది. అంతేకాకుండా, ప్రపంచంలోని చమురు, ఎల్ఎన్జిలో సుమారు 10 శాతం ఈ సముద్ర మార్గం గుండా రవాణా అవుతుంది. అందువల్ల, హోర్ముజ్ జలసంధి తర్వాత ఇరాన్, బాబ్ అల్-మండేబ్పై దిగ్బంధనం విధిస్తే ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో 30 శాతానికి పైగా అంతరాయం ఏర్పడవచ్చు. ఇక భారత్ విషయానికి వస్తే.. భారత్ నుంచి యూరప్, ఉత్తర ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే ఎగుమతులు, దిగుమతులు అధికంగా సూయజ్ కెనాల్ మీదుగా సాగుతాయి. ఈ మార్గంలో ప్రవేశించాలంటే బాబ్ అల్-మండేబ్ జలసంధిని దాటాల్సి ఉంటుంది.
