Ravindra Jadeja About To Play For Rajasthan Royals in IPL 2026: ఐపీఎల్ 2026లో జట్ల మార్పులు, కొత్త కాంబినేషన్లు క్రికెట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున బరిలోకి దిగడం ప్రత్యేక చర్చకు దారి తీసింది. సోమవారం గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో జడేజా ఆర్ఆర్ తరఫున మొదటి మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ 2026 ముందు ట్రేడ్ ద్వారా చెన్నై నుంచి రాజస్థాన్కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కొత్త జట్టుపై జడేజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా వ్యాఖ్యతతో మాట్లాడాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడడం ఎలా ఉంది అని అడగగా.. జడ్డు సరదాగా స్పందించాడు. ‘పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది’ అంటూ నవ్వుతూ చెప్పాడు. రాజస్థాన్ జెర్సీకి ప్రత్యేకమైన పింక్ రంగు ఉండటం తెలిసిందే. తన కొత్త జట్టుతో కంఫర్ట్గా ఉన్నాననే సంకేతాన్ని జడేజా ఈ మాటలతో స్పష్టత ఇచ్చాడు. చెన్నైపై జడ్డు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో 18 రన్స్ ఇచ్చి రెండు వికెట్స్ పడగొట్టాడు. సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే లాంటి డేంజరస్ ప్లేయర్లను జడేజా పెవిలియన్ చేర్చాడు. అయితే బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
Also Read: SKN : పెద్ది రిలీజ్ డేట్ కాంట్రవర్సల్ కామెంట్స్ పై SKN వివరణ
మ్యాచ్లో శివమ్ దూబే వికెట్ తీయడంపై కూడా ఆర్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘దూబేను నేను చాలా కాలంగా చూస్తున్నా. ఇద్దరం కలిసి ఆడాం. నెట్స్లో కూడా అతడికి నేను బౌలింగ్ చేశాను. స్పిన్నర్లపై అతడు ఎలా ఆడతాడో నాకు బాగా తెలుసు. అందుకే ఆఫ్ స్టంప్ బయట బంతులు వేయాలని ప్లాన్ చేసుకున్నాం. లక్కీగా నాకే దొరికేశాడు’ అని జడేజా తెలిపాడు. అనుభవంతో పాటు వ్యూహాత్మక ఆలోచనలతో జడేజా రాజస్థాన్ జట్టుకు కీలక ఆటగాడిగా మారుతున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.
