Asha Workers | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సచివాలయ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్లకుండా ఎక్కడిక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. వేములవాడ, తంగళ్లపల్లిలో పలువురు ఆశావర్కర్ల ఇంటికి వెళ్లి, వారిని బలవంతంగా పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై ఆశావర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
