భద్రాచలం : ఉగాది(Ugadi) పర్వదినం సందర్భంగా నేటి నుంచి శ్రీరామనవమి(Sri Ramanavami) బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏటా ఉగాది రోజున ఉత్సవాలకు అంకురార్పణ జరపడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలతో ఆలయ అర్చకులు, వేద పండితులు వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 27న మిథిలా మండపంలో సీతారామ కళ్యాణోత్సవం జరపనున్నారు.
ఏప్రిల్ 2 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. కాగా, బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నవమి రోజున రెండు లక్షల తలంబ్రాల ప్యాకెట్లు, లక్ష లడ్డూలు సిద్ధం చేసినట్లు వివరించారు.
