Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Inter Colleges: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు

Ai generated article, credit to orginal website, November 4, 2025

Inter Colleges : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల పనితీరు మెరుగుపరచడంలో భాగంగా కాలేజీల్లో బోర్డు తనిఖీలు చేపట్టింది. ఈ నెల 15 వరకు తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,752 ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో (Inter Colleges) విద్యా ప్రమాణాలు, పరిపాలనా పరమైన నిబంధనలు అమలుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తనిఖీల్లో స్పెషల్ ఆఫీసర్లు, డిప్యూటీ సెక్రటరీలు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు (డీఐఈఓ) తమ పరిధిలోని కాలేజీలను తనిఖీ చేయనున్నారు. తనిఖీలు పూర్తయిను వెంటనే సమగ్ర తనిఖీ నివేదికను ఇంటర్ బోర్డు కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.
ప్రధానంగా పలు కీలక అంశాలను తనిఖీ చేయనున్నారు. ప్రైవేటు కాలేజీల్లో అఫ్లియేషన్ ఉన్నదా? లేదా?, విద్యార్థుల డేటా ఎంట్రీ సరిగ్గా రికార్డ్ చేస్తున్నారా? లేదా? అనే దానిని చెక్ చేయనున్నారు. ప్రభుత్వ కాలేజీలు కోచింగ్ క్లాసులు నడపడం, కాలేజీలు యూనిఫాం టైం టేబుల్ ఫాలో అవుతున్నాయా లేదా, సిలబస్ పూర్తయిందా, విద్యార్థుల హాజరు ఎంత శాతం ఉందనేది చెక్ చేస్తారు. ఇంటర్ ఎగ్జామ్స్ కు రెండు నెలలకుపై సమయం ఉన్నందున దీని ప్రకారం యాక్షన్ ప్లాన్ రూపొందించి సిలబస్ పూర్తి చేస్తున్నారా? లేదా? అనే అంశాలను పరిశీలించనున్నారు.
Inter Colleges – నేటి నుంచి విద్యాసంస్థలు బంద్‌
తెలంగాణలో (Telangana) నేటి నుంచి ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు నిరవధిక బంద్‌ను పాటించనున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, బీఈడీ తదితర వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ కళాశాలలు బంద్‌కు ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. దీంతో, కాలేజీలు మూతపడనున్నాయి.
రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే, దీపావళి నాటికి ప్రభుత్వం 600 కోట్లు ఇస్తామని భరోసా ఇచ్చినప్పటికీ ప్రభుత్వ హామీ నిలబెట్టుకోలేకపోవడంతో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు ఆందోళన బాట పట్టాయి. కాలేజీలు నడపలేకపోతున్నామని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో తక్షణమే బకాయిల్లో 50 శాతం చెల్లించాలని డిమాండ్‌ చేసింది. అయితే, బంద్‌ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం 1200 కోట్లకు టోకెన్లు ఇచ్చి కేవలం 300 కోట్లు అందించినట్టు సమాచారం.
Also Read : KTR: పేదల ఇళ్లపైకే హైడ్రా బుల్డోజర్లు – కేటీఆర్‌
The post Inter Colleges: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • CM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం
  • Minister Nara Lokesh: రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు – మంత్రి నారా లోకేష్
  • Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ ! 20 మంది మృతి !
  • Inter Colleges: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు
  • KTR: పేదల ఇళ్లపైకే హైడ్రా బుల్డోజర్లు – కేటీఆర్‌

Recent Comments

No comments to show.

Archives

  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes