Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Party Defection | ఫిరాయింపులపై నేడు తీర్పు.. ఐదు పిటిషన్లపై నిర్ణయం వెలువరించనున్న స్పీకర్‌

Ai generated article, credit to orginal website, December 17, 2025

రేపటితో ముగియనున్న సుప్రీంకోర్టు గడువు

Party Defection | హైదరాబాద్‌, డిసెంబర్‌ 16 (నమస్తే తెలంగాణ) : బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన (Party Defection) ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ (Gaddam Prasad Kumar) బుధవారం తీర్పు వెలువరించనున్నారు. తొలిదశలో ఐదుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్నట్టు స్పీకర్‌ కార్యాలయం తెలిపింది. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై నిర్ణయం ప్రకటిస్తారని వెల్లడించింది. ఈ పిటిషన్లపై 4 వా రాల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన గడువు గురువారంతో ముగుస్తున్నది. అందుకే హడావుడిగా తీర్పు వెలువరిస్తున్నట్టు చెప్తున్నారు.
‘ధిక్కరణ’ నుంచి తప్పించుకోవడానికేనా?
పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఫిర్యాదులపై స్పీకర్‌ ఎలాంటి విచారణ జరుపకుండా నెలలపాటు సాగదీసిన సంగతి తెలిసిందే. దీంతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సాగదీతపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తంచేసింది. స్పీకర్‌పై పలు వ్యాఖ్యలు చేసింది. మూడు నెలల్లో తేల్చాలని, జూలై 31న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 21తో గడువు ముగిసినా, తేల్చకపోవడంపై మండిపడింది. స్పీకర్‌ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేసింది. అంతేకాదు నాలుగు వారాల్లోగా విచారణ పూర్తిచేయాలని గత నెల 17న తుది గడువు విధించింది. ‘స్పీకర్‌ చర్యలు కోర్టు ధిక్కారమే. నాలుగువారాల్లో నిర్ణయం తీసుకోండి. లేదా నూతన సంవత్సరం వేడుకలు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ నెల 18వ తేదీ (గురువారం)లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే స్పీకర్‌ కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది. కాబట్టి హడావుడిగా తీర్పు వెలువరిస్తున్నారని చర్చ జరుగుతున్నది.
ఐదుగురినీ తప్పిస్తారా?
ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి స్పీకర్‌ బుధవారం తీర్పును వెలువరించనున్నారు. ఈ ఐదుగురు పార్టీ ఫిరాయించారనేందుకు తగిన ఆధారాలు లేవని, కాబట్టి వారిని ఫిరాయింపుదారులగా ప్రకటించలేమంటూ స్పీకర్‌ తీర్పు చెప్పే అవకాశం ఉన్నదని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఐదుగురికి సంబంధించి తీర్పు ఇచ్చామని, మిగిలిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని స్పీకర్‌ సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. మరోవైపు పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ గతంలో నోటీసులు ఇవ్వగా, ఇప్పటివరకు ఎనిమిది మంది మాత్రమే సమాధానం ఇచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేరుగా స్పీకర్‌ను కలిసి సమాధానం ఇవ్వడానికి మరికొంత సమయం కోరారు. దానం నాగేందర్‌ ఇప్పటివరకు స్పందించలేదు. గురువారం నాటి సుప్రీంకోర్టు విచారణ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • తీర‌నున్న ఓరుగల్లు ఎయిర్ పోర్టు క‌ల
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్
  • టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌
  • వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు
  • అధికారంలోకి రావాలంటే జ‌గ‌న్ లో మార్పు రావాలి

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes