ఇరాన్ అణు ముప్పును తొలగిస్తామని అధ్యక్షుడు ట్రంప్ శపథం చేశారు. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా హెచ్చరికలను ఇరాన్ ధిక్కరించిందని.. గతేడాది ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకున్నాక కూడా ప్రయత్నాలు మాత్రం ఆపలేదన్నారు. అందుకే ఇరాన్ ముప్పును తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అవసరమైతే భూతల దాడులు కూడా చేస్తామని.. అమెరికా దళాలు కూడా మోహరిస్తాయని ట్రంప్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Iran-US: ఇరాన్పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ బాంబ్ల వర్షం.. రియాద్పై ఇరాన్ దాడి
అమెరికాను చేరుకోగల క్షిపణులను ఇరాన్ ఇప్పటికే అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. ‘‘వారి దగ్గర అమెరికాను ఢీకొట్టగల క్షిపణులు ఉన్నాయి. కానీ నేను అలా జరగనివ్వను. ఈ ఇరాన్ ప్రభుత్వం గత 47 సంవత్సరాలుగా అమెరికన్లపై దాడి చేస్తోంది. ఈ దుష్ట ప్రభుత్వంపై దాడి చేయడానికి ఇదే మాకు చివరి అవకాశం.’’ అని అన్నారు. ఈ ఆపరేషన్ ఐదు నుంచి ఏడు వారాల పాటు కొనసాగవచ్చని స్పష్టం చేశారు. ‘‘మా లక్ష్యం స్పష్టంగా ఉంది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాలను నిర్మూలించడం. వారు అణ్వాయుధాలు.. కలిగి ఉండటానికి మేము అనుమతించము.’’ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Off The Record: వైసీపీని వీడిపోయే వాళ్లకు పర్మినెంట్ డోర్స్ క్లోజ్..! ఆ మాజీ ఎమ్మెల్యే వైల్డ్గా రియాక్ట్ అయ్యారా?
