దర్శకధీరుడు ప్రశాంత్ నీల్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలయికలో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్). ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తన కెరీర్లోనే అత్యుత్తమ చిత్రంగా నిలబెట్టాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ఆయన స్క్రిప్ట్ పనులకే చాలా సమయం కేటాయించారు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నింటికంటే ‘డ్రాగన్’ విజువల్స్, మేకింగ్ పరంగా బెస్ట్ సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ మూవీపై లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్కు తగ్గట్టుగా ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ను ప్లాన్ చేస్తున్నారట. ఈ స్పెషల్ సాంగ్లో తారక్తో కలిసి స్టెప్పులు వేయడానికి ఒక టాప్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ను రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పాన్-ఇండియన్ అడ్వెంచర్ ఏ స్థాయి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
